కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి…

 

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 26 (అఖండ భూమి న్యూస్);

రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం దోమకొండ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, కొనుగోళ్లు జరిగిన వాటి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, వంటి ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, తహసీల్దార్ లు, ఎంపీడీఓ లు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!