తెలంగాణ చత్తీస్గడ్ ఆఖండ భూమి వెబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో చర్ల మండలం పుట్టపాడు వద్ద మావోయిస్టులు వారికి తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు గ్రేహౌండ్స్ బృందంపై కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఐవోఎస్ కమాండర్ రాజేశ్ ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ (SLR) ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం..



