2023: దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రారంభం..

 

 

దిల్లీ అఖండ భూమి వెబ్ న్యూస్ :

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ప్రారంభమైంది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది..

తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 40వేల మంది పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌,. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు..

Akhand Bhoomi News

error: Content is protected !!