మూడు రోజుల్లో 30 రూపాయల తగ్గిన జీడి మామిడి రేటు
అల్లూరి జిల్లా రంపచోడవరం/ గూడెం కొత్తవీధి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా
రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పందిరి మామిడి జంక్షన్ వద్ద దళారుల ఆధ్వర్యంలో సంవత్సరాల పాటుగా జీడి మామిడి పిక్కల వ్యాపారం మూడు పూలు ఆరు పిక్కలు గా కొనసాగుతుంది. దళారులు ఆడిందే ఆట పాడిందే పాట అనే సందనంగా రైతులనే టార్గెట్ చేసుకొని రోజురోజుకు రేటు తగ్గించి పూటకో మాట చెబుతూ రైతులు తీసుకువచ్చిన జీడిమాడి పిక్కలను తక్కువ ధరలకు కొని సొమ్ము చేసుకుంటున్నారు. పిక్క నల్లబడింది.. నాసుగా ఉంది పలు కారణాలతో రైతు దగ్గర నుండి దళారులు తమ ఇష్టాను సారంగా పిక్కలు కొనుబడే చేస్తూ, తమ ఇష్టమైన రేట్లను రైతుకు చెల్లిస్తూ రైతు కష్టాన్ని దోసుకుంటున్నారు…. కేజీ 50 రూపాయలు చేసి కొంటూ…
10 కేజీలకు తరుగు కేజీ రెండు కేజీలు తీసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు… ఈ తరహా పై అధికారులు కన్నెత్తి చూసిన పాపను పోలేదు.. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా లేక రైతు ఏమై పోయిన పర్వాలేదని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారా అనే అయోమయంలో రైతులు ఉన్నారు… ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దళారుల దోపిడిని అరికట్టి ఐటీడీఏ ద్వారా జీడిపిక్కలను సేకరించాలని పలువురు కోరుతున్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



