భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే ఇక భూభారతి చట్టం ప్రకారం చర్యలు…

 

 

భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే ఇక భూభారతి చట్టం ప్రకారం చర్యలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఏప్రిల్ 29 (అఖండ భూమి న్యూస్);

14 ఏప్రిల్ నుండి మీ సేవా కేంద్రంలో భూ సమస్యలపై దరఖాస్తు సమర్పిస్తే భూ భారతి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని,

భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా మంగళవారం dongli తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో , మద్నూర్ రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సెక్షన్ 4 ప్రకారం హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలో గా దరఖాస్తు చేసుకోవచ్చు.

సెక్షన్ 5 ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామ ద్వారా కొనుగోలు చేసిన క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ , స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. అట్టి వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్త ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలో రైతులకు భూదార్ కార్డుల జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే నివృత్త చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ధరణీలో అప్పీలు కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు, ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు. చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. హక్కుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి లైసెన్సు గల సర్వేయర్ తో భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాసుపుస్తమలో సర్వే మ్యాప్ ను ఉంచడం జరుగుతుందన్నారు. ఏ మైన భూ సమస్య ఉంటే సదరు పార్టీలకు నోటీసులు జారీ చేయాలని ఎవిడెన్స్ రికార్డు చేయాలనీ స్పీకింగ్ ఆర్డర్స్ స్పష్టమైన రీమార్కులతో నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం మీ సేవలో దరఖాస్తు పెడితే భూ భారతి చట్ట ప్రకారం విచారణ చేపట్టి నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలపై విచారణ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూ భారతి చట్టం లింగంపేట్ మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుచున్నదని తెలిపారు. ప్రజలందరూ భూ భారతి పై అవగాహన కల్పించుకోవాలని అన్నారు.

 

సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ, భూములకు సంబంధించిన సమస్యలకు చట్టం వచ్చిన ఒక సంవత్సరంగా దరఖాస్తు సమర్పించాలని అన్నారు. భూ భారతి చట్టం ప్రకారం తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిల్లో పరిష్కారం చేసుకోవచ్చు అని తెలిపారు. సాదాబైనామా, మ్యుటేషన్, సక్సెషన్, వంటి అంశాలపై వివరించారు.

ఆయా అవగాహన సదస్సులలో పలువురు రైతులు ప్రసంగించారు.

అంతకుముందు చట్టం పై రూపొందించిన వివరాలను ఆయా తహసీల్దార్లు వివరించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు భూ భారతి పై రూపొందించిన వీడియో ప్రదర్శించారు.

ఈ సదస్సులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పాక్స్ చైర్మన్లు, ఆయా మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, రెవిన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!