మహిళా శక్తి భవనం నిర్మాణం పూర్తి చేయాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 7 (అఖండ భూమి న్యూస్);
మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న మహిళాశక్తి భవనం పనులను గురువారం రోజున కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళాశక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణం పనులను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు 5 కోట్ల రూపాయలతో పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పనులు పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, ఇతర ఇంజనీర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


