మే 20న దేశవ్యాప్తగ జరిగే సమ్మెను జయప్రదం చేయండి

 

 

మే 20న దేశవ్యాప్తగ జరిగే సమ్మెను జయప్రదం చేయండి

శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గనిలో గేట్ సమావేశం.

కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు.

బెల్లంపల్లి మే 13(అఖండ భూమి న్యూస్ ):ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ప్రచారంలో భాగంగా మంగళవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి ఖని.గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ…. కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు కట్టు బానిసలను చేసే నాలుగు లేబర్ కోడలు మాకొద్దంటూ కార్మిక చట్టాల జోలికి వస్తే ఐక్య పోరాటాలతో కార్పొరేట్ విధానాలను పాతాళానికి తొక్కి పెడతామని కార్మిక వర్గం ఐక్యతతో చేసే ఐక్య పోరాటాలలో కార్మికులంతా భాగస్వాములు కావాలన్నారు.పాలకుల విధానాలను మార్చుకోకుంటే పాలకులనే మార్చే శక్తి కార్మిక వర్గానికి ఉందని గత పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చే ప్రభుత్వ విధానాన్ని గత పోరాటాల వారసత్వం స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా పోరాడి కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం మే 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.ఈ గేట్ మీటింగ్కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్,సెంట్రల్ సెక్రెటరీ పార్వతి రాజిరెడ్డి, సుదర్శన్, ఐఎఫ్టీయూ -జీఎల్బీకే ఎస్,రాష్ట్ర అధ్యక్షులు,ఎండీ.చాంద్ పాషా,రీజియన్ నాయకులు,టీ. శ్రీనివాస్,ఎండీ.జాఫర్,టీ ఎన్ టీ యూ సీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.మనిరామ్ సింగ్, సింగరేణి గని కార్మిక సంఘం,రాష్ట్ర కన్వీనర్,

ఏ.మహేందర్,రీజియన్ నాయకులు,ఏ.శంకర్,తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం,రాష్ట్ర అధ్యక్షులు,నీరటి.రాజన్న,జీ.శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!