షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 5 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీనీ బిక్కనూర్ మండలం రమేశ్వర్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రామంలోని పలు సమస్యలపై నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తో చర్చించారు. గ్రామ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించించారు.
ఈ కార్యక్రమంలో రాజేందర్, శశికుమార్, కొండల్ రెడ్డి, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ రెడ్డి, రమేష్ రెడ్డి, సూర్యకాంత రెడ్డి, తతిదారులు పాల్గొన్నారు.


