రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి – జనసేన మండల అధ్యక్షులు వెలగల వెంకట రమణ
నాతవరం మండలం మే 30 అఖండ భూమి,
నాతవరం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. వెంకటరమణ మాట్లాడుతూ జూన్ 1 న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరికి రేషన్ అందించే కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యలు నాదెండ్ల మనోహర్, ఆదేశాలతో నాతవరం మండలంలో ప్రతీ గ్రామంలో రేషన్ డిపోల దగ్గర బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రేషన్ కార్డు లబ్ది దారునికి రేషన్ పంపిణీ అయ్యేలా ఆ పంచాయతీ పరిధి లో కూటమి నాయకులు అందరూ తప్పనిసరిగా పర్యవేక్షించాలని ఆయన కోరారు.
*
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



