ఎనిమియా ముక్త్ భారత్ శిక్షణ కార్యక్రమం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 12 (అఖండ భూమి న్యూస్)
కమీషనర్ , వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ , మాతా శిశు ఆరోగ్య అధికారి డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో దేవునిపల్లి పి హెచ్ సి లో గురువారం ఎనీమియా ముక్త్ భారత్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఫార్మసీ అధికారులకు జిల్లాలో రక్త హీనత లేని మహిళల కోసం ఆరోగ్య కారణమైన మందులు వాడేందుకు సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ పై పూర్తిస్థాయి శిక్షణను అందించినట్లు మాతా శిశు ఆరోగ్య అధికారి డా. అనురాధ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ హెల్త్ నర్స్ జానా బాయి, జిల్లా డ్రగ్ స్టోర్ ఫార్మసీ అధికారి దీప్తి, జిల్లాలోని ప్రాథమిక,పట్టణ ఆరోగ్య కేంద్రాల ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.