సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి లక్ష రూపాయల విరాళం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 12 (అఖండ భూమి న్యూస్)
దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అందుకే వారి సంక్షేమానికి భారత దేశ పౌరునిగా చేయూతనందిస్తూ వారికి సంఘీభావము తెలుపుతూ సాయుధ దళాల పతాక నిధికి లక్ష రూపాయల చెక్కును .కె.క్రిష్ణ మూర్తి శర్మ (పంతులు) విద్యుత్ శాఖ ఉద్యోగి (రిటైర్డ్) కామారెడ్డి వాస్తవ్యులు ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అధికారి అయిన శ్రీ.డి.రమేష్ కి గురువారం అందజేసినారు. తదుపరి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కె.క్రిష్ణ మూర్తి శర్మ (పంతులు)ని శాలువతో సత్కరించి అభినందించుతూ, .కె.క్రిష్ణ మూర్తి శర్మ (పంతులు) ని స్పూర్తిగా తీసుకొని కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల నుండి వ్యాపారస్తులు , ప్రజలు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న సైనికులకు వారి కుటుంబాలకి స్వచ్ఛందముగా విరాళాలను అందించి ఆదుకోవాలని తెలిపారు. దేశ రక్షణ కొరకు చేసిన త్యాగాలకన్న మించిన త్యాగం మరి ఏది లేదని కొనియాడినారు. ఈ సన్మాన కార్యక్రమములో ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి (పూ.అ.భ), డి.రమేష్ , కార్యాలయ సిబ్బంది, బదాం గంగామోహన్, ఉమేర్ పాల్గోన్నారు.