15 న దోమకొండలో సమూహిక అక్షరభ్యాస మహోత్సవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)
సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం దోమకొండ గ్రామం , పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా 15-జూన్ ఆదివారం రోజున దోమకొండ గడికోట నందు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామనీ దోమకొండ గడికోట, గ్రామీణ అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ అధికారి బాబ్జి, నేతుల గణేష్ లు తెలిపారు.
. వేద పండితుల సమక్షంలో సరస్వతి పూజ అనంతరము చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. అక్షరాభ్యాసానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని పలకలను చిన్నారులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకు తోడ్పడు అందించాలని అన్నారు.ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనదలచిన చిన్నారుల యొక్క తల్లిదండ్రులు సంప్రదించవలసిన నెంబర్ 9493143378,9441957951,9948137616 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



