బిబిపేట పెద్ద చెరువులో పడి యువకుడు దుర్మరణం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 14 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పెద్ద చెరువు లో గల ఒక కుంటలో చేపల వేటకు వెళ్లిన గుర్రం లక్ష్మణ్ (40) రాత్రి 10 గంటల వరకు రాకపోయేసరికి రాత్రి నుండి కుటుంబ సభ్యులు వెతుక సాగారు. ఉదయం బీబీపేట చెరువు లో గల ఒక కుంట దగ్గర చెప్పులు సైకిల్ ఉన్న దని సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడి కుంటలో వలవేసి చూడగా వలకు చిక్కిన లక్ష్మణ్ శవాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న బీబీపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరి పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. మృతుడికి భార్య మంజుల, కూతురు శిరీష కుమారుడు నిఖిల్ ఉన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



