పదవ తరగతి టాపర్లకు దోమకొండ గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహ బహుమతులు అందజేత…

పదవ తరగతి టాపర్లకు దోమకొండ గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహ బహుమతులు అందజేత…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి ఇద్దరు కాపర్లకు ప్రోత్సాహక బహుమతులను దోమకొండ గడికోట వారసుడు కామినేని అనిల్ చేతుల మీదుగా అందజేశారు. ఆదివారం దోమకొండ గడికోట లో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచిన బాలికల జిల్లా పరిషత్ పాఠశాల సిహెచ్ సంచిత 600 మార్కులకు గాను 560 మార్కులతో, ద్వితీయ స్థానంలో యూ రేవతి 600 మార్కులకు గాను 559 మార్కులు సాధించి కాపాడుగా నిలిచిన బాలిక విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ట్రస్ట్ ప్రతినిధులు బాబ్జి, గణేష్ లతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!