యువత రాజకీయాల్లోకి రావాలి

యువత రాజకీయాల్లోకి రావాలి

టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 16 (అఖండ భూమి న్యూస్ )

మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావాలని టీపీపీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంద్రకరణ్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవిరావడంతో బీబీపేట మండలం యూత్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్ సోమవారం రోజు ఆయనను మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం కాబోతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీ కలిగిన నేతలుగా ఎదుగుతారని సూచించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించి అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరకాల రవి, బీబీపేట్ ప్రెసిడెంట్ నాగరాజు, జనగామ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్, ఇస్సనగర్ యూత్ ప్రెసిడెంట్ కనకరాజు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!