మూడు ఎకరాల్లో రైతులందరికీ ఖాతాల్లో డబ్బులు జామ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్)
వేసవిలో సాగునీరు లేక పంటలు వేయలేకపోయినా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా డబ్బులు రాకపోవడంతో నిరాశ చెందిన రైతన్న గుండెల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా వేయడంతో రైతు హృదయాల్లో చిగురు ఆశలు నిండుకున్నాయి.గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం పై నిరాశతో ఉన్న రైతుల ముఖాల్లో ఆనందోత్సవాలు అలుముకున్నాయి. మొదటిరోజు చిన్న రైతులకు మంగళవారం రాత్రి నుండే రైతు భరోసా జమ చేశారు. రెండో రోజు15.51.89 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో సర్కారుద్యమ చేసింది. మూడు ఎకరాల లోపు మూడు ఎకరాలు లోపున్ ఉన్న రైతులందరికీ ఉదయం 10.45 నిమిషాల నుండి రైతుల ఖాతాల్లో ఎకరాకు 6000రూ. చొప్పున జమ . రేవంత్ రెడ్డి సర్కార్ జమ చేశారు. ఎకరాలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో రైతులందరికీ భరోసా వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ తెలిపారు. మొత్తానికి రాష్ట్రంలో ఉచిత విద్యుత్, ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్లు, దీంతోపాటు ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలలో మరో గ్యారంటీని అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ మరోసారి రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్రింది స్థాయి కార్యకర్తలను సిద్ధం చేసినట్లు సమాచారం.