ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి …
పి డి ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి జి సురేష్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి: జూన్ 17:(అఖండ భూమి న్యూస్)
కామారెడ్డివిద్యాశాఖ కార్యాలయం ఎదురుగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి జి సురేష్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం జిల్లా వ్యాప్తంగా కార్పోరేట్ ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులే పాఠశాలల వద్దకు వెళ్లి వారి యొక్క పిల్లల పేర్లను నమోదు చేసుకోవాల్సింది పోయి పాఠశాలల నుండే టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క పాఠశాలకు సంబంధించిన రంగురంగుల కరపత్రాలను ఇళ్లలో ఇచ్చి మా పాఠశాలలో చేరండి అని అడిగే పరిస్థితి వచ్చింది బడులు అనేవి ఈ కాలంలో పెట్టుబడులుగా మారాయి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు ఇళ్లల్లో తిరగడం సరైన పద్ధతి కాదన్నారు ముఖ్యంగా పాఠశాలలు అడ్మిషన్ ఫీజు పేరిట 3000 నుండి ఇంకా అదనంగా ఫీజులు తీసుకుంటున్నారు పాఠశాలలో పుస్తకాలు అమ్మవద్దని నిబంధనలు ఉన్నా కానీ పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు అమ్ముతున్నారన్నారు ముఖ్యంగా అపార్ట్మెంట్లలో జిల్లా కేంద్రంలో పాఠశాలలు నడుపుతున్నారు ఏమైనా ప్రమాదం జరిగినా విద్యార్థులు తప్పించుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ఇవన్నీ పోను మౌలిక వసతులు కల్పించకుండానే వేలాదిగా రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు ఈ ఫీజులు నిర్ణయించుకోవడానికి ఒక గవర్నర్ బాడీ ప్రతి పాఠశాలలో ఉంటుంది ఈ గవర్నర్ బాడీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక సీనియర్ సిటిజెన్ ఎంఈఓ తదితరులతో కలిసి గవర్నర్ బాడీ ఉండాలి. కానీ ఆ యొక్క పాఠశాలకు సంబంధించిన సభ్యులతోనే గవర్నర్ బాడీ ఏర్పాటు చేసుకొని ఫీజులను నిర్ణయించుకుంటున్నారు ఇది విద్య హక్కు చట్టానికి విరుద్ధం ఫీజుల నియంత్రణ చట్టాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అమలు పరచాలి లేనిచో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాయికుమార్, శేఖర్ ,ప్రశాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.