రైతులకు అధిక వడ్డీల రుణాల నుండి తప్పించి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 18 (అఖండ భూమి న్యూస్)
రైతులను అధిక వడ్డీ రుణాలు భారీ నుండి తప్పించి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు భారి నుండి తప్పించి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి టి .నాగరాణి ఆదేశించారు. బుధవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతులకు రుణాల మార్పిడి, మంజూరు పై న్యాయ చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు. ఆర్బిఐ సూచనలు మరియు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రైతులకు రుణాలు మంజూరులో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని నాగరాణి అన్నారు. అవగాహన లోపంతో రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తున్నారని దీని వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనీ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆమె అన్నారు. రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందడానికి వ్యవసాయ అధికారులు సహకరించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రైతులు నష్టపోయినప్పుడు అధికారులు సానుకూలంగా స్పందించి సహకరించాలని సూచించారు. రైతులు ఆత్మహత్యలకు దూరంగా ఉండి బాధ్యతతో బ్యాంకు రుణాలు చెల్లించాలని అన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం గతేడాది 3000 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోగా 2600 కోట్లు మంజూరు చేశామని అన్నారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలపై తమ దృష్టికి తీసుకురావాలని లీడ్ బ్యాంకు మేనేజర్ తెలిపారు. రైతులకు వంట రుణాలతో పాటు తక్కువ వడ్డీ రేటు కు బంగారం పై రుణాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు ఏ విధమైన రుణాలు పొందడానికి అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ ఏర్పాటు చేసేలా బ్యాంకు అధికారులు మరియు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటామని అన్నారు. అందుకు కావలసిన సహాకారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తారని అన్నారు. రైతులకు వంటల బీమా పై అధికారుల అవగాహన కల్పించాలని, రుణాల మంజూరులో అధికారులు రైతులకు సహకరించాలని రైతు సంఘం అధ్యక్షుడు శ్రీహరి Rao అన్నారు. అనంతరం రుణాల మంజూరు లో ఎదురయ్యే సమస్యలపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, ఏడిఏ అపర్ణ, ఏవో లు, ఏ ఈ ఓ లు. బ్యాంక్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.