ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);
ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడిఓసి లోని సమావేశ మందిరంలో కామారెడ్డి ఆర్డిఓ వీణ తో కలిసి ప్రజలండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి 107 అర్జీలు వచ్చినాయి. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి ఆర్జి దారులకు న్యాయం చేయాలనిఅన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.