ప్రైవేట్ ట్రావెల్స్పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు
యజమానులకు హెచ్చరికలు
డ్రైవర్ల భద్రతా ప్రమాణాలు, ఎగ్జిట్ డోర్లు, ఫైర్ కంట్రోల్ పరికరాలు పరిశీలన
క్రిష్ణగిరి, నవంబర్ 05 (అఖండ భూమి న్యూస్):
క్రిష్ణగిరి ఎస్సై జి.కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి నిన్న రాత్రి పై అధికారుల ఆదేశాల మేరకు అమకుతాడు టోల్గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా డ్రైవర్లు మరియు ప్యాసింజర్ల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఎగ్జిట్ డోర్లు, లగేజ్ క్యారియర్లలో అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే దానిపై విపులంగా పరిశీలన జరిపారు. ఫైర్ను నియంత్రించడానికి అవసరమైన పరికరాలు సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేశారు.
ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లకు సురక్షిత ప్రయాణం కోసం తగు సూచనలు అందజేసిన ఎస్సై గారు, నియమ నిబంధనలు ఉల్లంఘించిన బస్సు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికుల ప్రాణ భద్రతకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగకుండా చూడాలని ఆయన సూచించారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



