ఊపిరితిత్తుల మార్పిడి కోసం సకాలంలో ఓ నెగిటివ్ రక్తం అందజేత..
*26 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన బద్దం నిశాంత్ రెడ్డి..
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్)
హైదరాబాదులోని సికింద్రాబాద్ యశోద వైద్యశాలలో వేలంపాటి త్రివేణి (43) ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ కావలసిన ఓ నెగిటివ్ రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుడు సంప్రదించడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లి సకాలంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందని డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో 26వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన గడ్డం నిశాంత్ రెడ్డికి ఉప్పల శ్రీనివాస్ గుప్త తరఫున అభినందనలు తెలియజేశారు.సమాజంలో ఎవరికో ఇబ్బంది వస్తే నాకేమిటి అనే భావనను వదిలి పెట్టాల్సిన అవసరం ఉందని,తోటి వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయాల్సిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉందని అలాంటి గొప్ప ఆదర్శవంతమైన వ్యక్తులలో నిశాంత్ రెడ్డి ఒకరిని వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…