దోమకొండ వన మహోత్సవంలో పాల్గొన్న అధికారులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్)
దోమకొండ మండల కేంద్రంలో వన మహోత్సవంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎం జ్యోతి, మండల పరిషత్ అధికారి ఎన్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. దోమకొండ లోని బాలికల గురుకుల పాఠశాల తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఇందులో భాగంగా పరిశుభ్రం గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, చుట్టూ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేవిధంగా అట్టివ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అన్ని గ్రామ పంచాయతీ వివోలతో సమావేశం నిర్వహించి గ్రామాల్లో తీసుకోవాల్సిన పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. అనంతరం గురుకుల పాఠశాలలో భోజనాల నాణ్యత పై పరిశీలించి విద్యార్థులతో భోజనాలు చేశారు. ఇందిరా మహిళా శక్తి పనితీరుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళా శక్తి సభ్యులు, ఏపీవో, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


