ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 14 (అఖండ భూమి న్యూస్)

ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ ల తో కలిసి ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి 95 అర్జీలు వచ్చినాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి ఆర్జి దారులకు న్యాయం చేయాలనిఅన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!