గవర్నర్ చే డాక్టరేట్ అందుకున్న డాక్టర్ బాలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 16 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 2వ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిచే అర్థశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీనీ ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీలో అందుకోవడం జరిగింది.
రక్తదానంలో చేసిన సేవలకు గాను గతంలో తమిళ్ సై సౌందర్య రాజన్ చే ఒక బంగారు,రెండు వెండి పథకాలను కూడా అందుకోవడం జరిగింది.అర్థశాస్త్రంలో డాక్టరేట్ సాధించడానికి సహకరించిన వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు,రిజిస్టర్ యాదగిరి,సూపర్వైజర్,అసోసియేట్ ప్రొఫెసర్ పాత నాగరాజు,ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి,సహాయ ఆచార్యులు డాక్టర్ పున్నయ్య,డాక్టర్ సంపత్,డాక్టర్ స్వప్న,డాక్టర్ దత్తహరి,డాక్టర్ శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


