నీటి ఎద్దడి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోరు మోటర్ వేయించిన పల్లె రమేష్ గౌడ్…

ఫరీద్ పేట్ గ్రామంలో తాగునీటి సమస్యకు వేగవంతమైన పరిష్కారం – పల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ చొరవ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా, పల్వంచ మండలంలోని ఫరీద్ పేట్ గ్రామం 12 వ వార్డులోసుదీర్ఘకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు సత్వరమైన, సమర్థవంతమైన పరిష్కారం లభించింది. ఈ సమస్యను గుర్తించిన వెంటనే, పల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ అత్యంత చొరవ చూపి, తాగునీటి సరఫరాకు అవసరమైన బోరు మోటార్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, నిరంతరాయమైన తాగునీటి సరఫరా సాధ్యమైంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, 12 వ వార్డు ప్రజలు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లె రమేష్ గౌడ్ నాయకత్వంలో ఈ మంచి పని విజయవంతంగా పూర్తయినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.


