మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 24 (అఖండ భూమి న్యూస్); తెలంగాణ రాష్ట్రము లో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం లో ప్రయాణించిన 200 కోట్ల మహిళా ప్రయాణికులు, సుమారు 6700 కోట్ల రూపాయలు తేది 23జూలై 2025 నాటికి ఆదా చేసుకున్న సందర్భంలో బుధవారం కామారెడ్డి బస్సు స్టేషన్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిధి గా విచ్చేసి, మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పై అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమం లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, , ఏ ఎస్ పి కుమారీ చైతన్య రెడ్డి. ఆర్డిఓ వీణ ,అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం లొ డి ఎం కరుణ శ్రీ కామారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం లో డిపో సూపెర్వైసోర్స్, సిబ్బంది , ఈ కార్యక్రమం లో ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్రయాణికురాలకు బహుమతుల తో పాటు శాలువా తో సన్మానించారు. స్కూల్ విద్యార్థుల చే ముగ్గుల పొటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసినారు. వీటి తో పాటు ఆరు స్పెషల్ టూర్ ప్యాకేజీ కర పత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


