నిజాయితీ చాటుకున్న లేడీ కండక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 30, (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన లేడీ కండక్టర్ సువర్ణ తన నిజాయితీని చాటుకున్నారు. బస్సులో మరిచిపోయిన బ్యాగును తిరిగి ప్రయాణికురాలకు అప్పగించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జేబీఎస్ వరకు వెళ్ళింది .అందులో ఎక్కిన ఒక ప్రయాణికురాలు తన బ్యాగును బస్సులో మరిచి జేబిఎస్ లో దిగిపోయారు .బస్సులో ఉన్న బ్యాగును గమనించిన కండక్టర్ సువర్ణ దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకున్నారు. బస్సు దిగిపోయినా ప్రయాణికురాలు తన వద్ద బ్యాగు లేదని కనుగుతినిపోయి తిరిగి బస్ స్టాప్ వద్దకు చేరుకున్నారు .అక్కడ ఉన్న కండక్టర్ ను సంప్రదించగా బ్యాగు తన వద్ద ఉందని చెప్పారు. బ్యాగులో నాలుగు తులాల బంగారం ,సెల్ ఫోన్ తో పాటు నగదు ఉండగా వాటిని ప్రయాణికురాలకు కండక్టర్ సువర్ణ అప్పగించారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ సువర్ణను పలువురు ప్రయాణికులు అభినందించి అక్కడ ఆమెకు మిఠాయిలు తినిపించారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…