కలెక్టర్ చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సెంట్ స్ట్రక్చర్స్ అందజేత…

దోమకొండ ఫోర్ట్, విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సెంట్ స్ట్రక్చర్స్ అందజేత…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);

ఆక్సిజన్ ను గుర్తించబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దోమకొండ ఫోర్ట్, విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా వైద్యాధికారి సమన్వయంతో శనివారం అందజేశారు. కామారెడ్డి జిల్లాలోని ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెంటర్లు బీబీపేట, ముత్యంపేట్, బిక్కనూర్, దేవునిపల్లి, లింగంపేట్, రామారెడ్డి, నాగిరెడ్డిపేట్, డోంగ్లి కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సెంట్ ట్రాక్టర్స్ ను జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు అందజేశారు. ఈ ఆక్సిజన్ కంటెంట్ ట్రాక్టర్స్ వృద్ధులకు, శ్వాసకోస వ్యాధులకు, అస్తమా తో బాధపడే వారికి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడతాయని వైద్యాధికారులకు తెలిపారు. ఈ ఆక్సిజన్ కాన్సెంట్ ట్రాక్టర్స్ శీతాకాలంలో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ పోర్ట్ అండ్ ట్రస్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బాబ్జి జూలాది, సిబ్బంది నిధుల గణేష్ యాదవ్, మద్ద వినయ్, వైద్య సిబ్బంది చలపతి, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!