నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..!
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ, గోసంగి వాడ కాలనీలలో నూతన రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గత ప్రభుత్వా లు 15 సంవత్సరాల నుండి నూతన రేషన్ కార్డులు అందించడం లో విఫలమయ్యారని అన్నారు. ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా చేసుకొని నూతన రేషన్ కార్డ్ లు మంజూరు చేసి పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రేషన్ కార్డు లు పొందినవారికి ఆరోగ్యశ్రీ తో పాటు, ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలలో అర్హులని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు లో మహిళల పేరిటనే మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగా సన్న బియ్యం కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఎక్కడలేని విధంగా ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టి అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు, 10 లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. మహిళలు 18 సంవత్సరాలకే డ్వాక్రా గ్రూపులో సభ్యురాలుగా కొనసాగవచ్చు అని, నూతన గ్రూప్ లు ఏర్పాటు చేసుకొని సభ్యులుగా చేరి సంఘాల ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోట్లాది రూపాయలను ఆర్టీసీకి చెల్లిస్తుందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా మహిళలు, వారి కుటుంబాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
You may also like
-
భార్యాభర్తల మధ్య అన్యోన్య త ఉండాలంటేఏమిచెయ్యాలి కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య కామారెడ్డి ఆగస్టు 7,
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్