దోమకొండలో వనమహోత్సవం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో వాన మహోత్సవంలో భాగంగా శనివారం దోమకొండ ఎక్సైజ్ సీఐ, గీత కార్మికుల ఆధ్వర్యంలో ఈతవనం నాటారు. దోమకొండలో 350, ముత్యంపేట్ లో 1000, సంగమేశ్వర్ లో200, తలమడ్ల లో 500, పొందుర్తిలో 200 ఈతవనం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, బొంబోతుల రాజనర్సు గౌడ్, నర్సాగౌడ్, రాజేందర్ గౌడ్, స్వామి గౌడ్, హరి గౌడ్, గీతా కార్మికులు పాల్గొన్నారు.


