జోగిపేట్ లో ఉన్న Sc మహిళ కళాశాల హాస్టల్ సొంత భవనం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు
(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 3 )
జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ జోగిపేట్ లో ఉన్న ఎస్సీ మహిళా కాలేజీ హాస్టల్ ను తక్షణమే నూతన భవనం ఏర్పాటు చేయాలి స్కూల్ కళాశాల హాస్టల్ రెండు ఒకే దగ్గర ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. బాలిక ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. విద్యార్థులకు మూత్రశాలలు సరిపడా లేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలియజేశారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కానోస్తున్న కూడా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులకు ఏ రకంగా నాణ్యమైన విద్య అందిస్తారని ప్రశ్నించారు.పాఠశాల లను తనిఖీలు చేయడంలో ప్రభుత్వ అధికారులు కూడా విఫలమయ్యారన్నారు. వెంటనే డీఈవో ఎంఈఓ పాఠశాలలు తనిఖీలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు.విగ్నేష్, యోగేష్, విశాల్, సామెల్, మల్లికార్జున్. తదితరులు పాల్గొన్నారు
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్