మెగా ఇంటి కోడలు ఉపాసనకు కీలక పదవి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సంతోషం వ్యక్తం చేసిన ఉపాసన…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 4 అఖండ భూమి న్యూస్
మెగా ఇంటి కోడలు.. రాం చరణ్ సతీమణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు
సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్గా నియమించింది.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉపాసనకు బాధ్యతలు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ బాధ్యతల కేటాయింపు పైన ఉపాసన స్పందించారు. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్గా నియమించటంపై ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ నియామకం తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావటం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన పేర్కొన్నారు.బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
You may also like
-
ఆనాటి తీరు గోప్యం .. నేటి తీరు బహిరంగం..! కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
-
రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పి ప్రావిణ్య, జిల్లా కలెక్టర్
-
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి. భవానిచంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని హఠాత్తుగా తనిఖీ చేసింది*l
-
ఒకే కుటుంబంలోని ఓటర్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు వేయేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ పి. ప్రావిణ్య
-
తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్