తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్
-జయంతి వేడుకల్లో మాజీ కౌన్సిలర్ గంగ మోహన్ చక్రు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 06: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించాడని తాజా మాజీ కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు అన్నారు. బుధవారం పట్టణంలోని 15వ వార్డు రాంనగర్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం గంగా మోహన్ చక్రు మాట్లాడుతూ మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా తెలంగాణ జన హృదయాల్లో నిలిచిన ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిదని, సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి అని, ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని ఉన్నారు. యావత్ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి దార పోసిన వ్యక్తి, జయశంకర్ జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. విజయంతి వేడుకల్లో వడ్ల నర్సింలు, హనుమాన్లు, నూనె సుదర్శన్, శివలింగం, తులసిపట్వారి, సురేష్, రమణయ్య తదితరులు ఉన్నారు.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్