చేనేత కార్మికులు ఆర్థికంగా బలోపేతం కావాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 7 (అఖండ భూమి న్యూస్);
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ కోట గ్రామ అభివృద్ధి సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చేనేత జెండాను ఆవిష్కరించారు. దోమకొండ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చేనేత ఉత్పత్తులను చేనేత కార్మికులను ప్రశంసిస్తూ మునుముందు ఇదేవిధంగా పురోగతిని సాధిస్తూ మహిళలు జీవనోపాదులను మెరుగుపరుచుకుంటూ ఆర్థిక స్థిరత్వం సాధించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులు రాణించాలని, ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కులవృత్తులపై ఆధారపడి చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని అన్నారు. చేనేత మహిళా శ్రామికులకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ మాజీ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, దోమకొండ చేనేత సొసైటీ అధ్యక్షులు బొమ్మెర లక్ష్మీనారాయణ, మద్దూరి భూపాల్ రెడ్డి, చింతల రాజేష్,బొమ్మెర శ్రీనివాస్,బత్తిని సిద్ధ రాములు, అనంతరెడ్డి, పాలకుర్తి శేఖర్,గంగా జమున, కొండాంజం, సిద్ధారెడ్డి , ట్రస్టు చైర్మన్ బాబ్జి ప్రతినిధులు గణేష్, వినయ్, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్ చేనేత పారిశ్రామికులు పాల్గొన్నారు.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్