ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు…

ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 7 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాష్ట్రీయ సేవికా సమితి ఆధ్వర్యంలో మహిళలు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డికి రక్షాబంధన్ సందర్భంగా గురువారం రాఖీలు కట్టారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కు అన్ని రకాలుగా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. నేను మీ అందరికీ రక్ష , మనందరం నియోజవర్గానికి దేశానికి రక్షా అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!