గూడెం ( అందోల్) గ్రామంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం
(అందోల్ మండల్ ప్రతినిధి
అఖoడ భూమిన్యూస్ ఆగష్టు 7)
ఈరోజు అందోల్ మండలం, గూడెం ( అందోల్) గ్రామంలో తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం – శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ మరియు డా .అరుణ ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక కార్యక్రమం (పి ర్ ఏ) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ర్ – విద్యార్థులు గూడెం ( అందోల్) గ్రామంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు మరియు సమస్యలు పటాల ఆధారంగా రైతులకు వివరించడం జరిగింది. వ్యవసాయ రంగంలో భాగంగా గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో విత్తడం జరిగింది అలాగే రైతులకు ఉన్న వనరుల గురించి అలాగే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో టీ ర్ వి కే – సంగుపేట్ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఈ కార్యక్రమం వల్ల గ్రామంలో ఉన్న ఆర్థిక సామాజిక ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు అని రైతులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ విస్తరణ అంశాలు అనగా ట్రాన్సాక్ట్ వాక్, చపాతీ పటం, సామాజిక పటం, వెన్ డయాగ్రం, సమస్యల చెట్టు, కాలనుగుణం పట్టిక, మాట్రిక్స్ ర్యాంకింగ్ మొదలైన వాటిని విద్యార్థులు క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ YP 1- S. శ్రీకాంత్ మరియు ఆకాష్ , వ్యవసాయ విద్యార్థులు A. సృజన్, M. నవజీవన్, B. చoదు, D. వరుణ్, బి. దినేష్ మరియు గ్రామ రైతులు బట్ట నర్సింలు , R. పవన్, వినయ్, శివరాజ్ వినోద్, కేశయ్య నవీన్, జగదీష్ మరియు తది తరులు పాల్గొన్నారు.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్