రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి … జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 7)
సంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు. మొత్తం ఐదు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం సంగారెడ్డి జిల్లా పరిధిలో భూమిని సేకరించాలని నిర్ణయించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా అధికారుల నుండి రీజినల్ రింగ్ రోడ్డు భూ సకరణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి, ఆందోల్ ఆర్డీవో పాండు, గజ్వేల్ మేనేజర్ నేషనల్ హైవే అథారిటీ మేనేజర్ శ్రీహరి, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్