బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ను ఉభయ సభలులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 9 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ను రాష్ట్ర ప్రతితో పాటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీగల తిరుమల గౌడ్, అబ్రబోయిన స్వామి, నల్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం దోమకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి , బిసి డిక్లరేషన్ లో పేర్కొన్న నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును వెంటనే పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఆమోదించి ప్రజల కోరిక తీర్చాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును వెంటనే పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఆమోదించి ప్రజల కోరిక తీర్చాలని ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు , సీతారాం మధు , అబ్రబోయిన రాజేందర్, షమ్మీ, రవి తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన కామారెడ్డి తాజా మాజీ మున్సిపాల్ ఛైర్ పర్సన్…
-
అడవిలింగాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి …
-
దోపిడి బంగారం ఆభరణాలు స్వాధీనం… కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
-
గంప గోవర్ధన్ కు రాఖి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు
-
కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు