రంగంపేట తిరుమల రైస్ మిల్ లో చోరీ
(కొల్చారం మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 ) మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు మండల పరిధిలోని రంగంపేట గ్రామ శివారులోని తిరుమల రైస్ మిల్ లో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. తిరుమల రైస్ మిల్ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చదవబడిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు నాలుగు లక్షల రూపాయలు చోరీకి పాల్పడినట్టు బాధితుడు ముప్పుడి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహియోద్దీన్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



