రంగంపేట తిరుమల రైస్ మిల్ లో చోరీ
(కొల్చారం మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 ) మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు మండల పరిధిలోని రంగంపేట గ్రామ శివారులోని తిరుమల రైస్ మిల్ లో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. తిరుమల రైస్ మిల్ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చదవబడిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు నాలుగు లక్షల రూపాయలు చోరీకి పాల్పడినట్టు బాధితుడు ముప్పుడి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహియోద్దీన్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



