రంగంపేట తిరుమల రైస్ మిల్ లో చోరీ
(కొల్చారం మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 ) మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు మండల పరిధిలోని రంగంపేట గ్రామ శివారులోని తిరుమల రైస్ మిల్ లో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. తిరుమల రైస్ మిల్ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చదవబడిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు నాలుగు లక్షల రూపాయలు చోరీకి పాల్పడినట్టు బాధితుడు ముప్పుడి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహియోద్దీన్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…



