సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ.. ఎస్సై పై కేసు నమోదు

 

 

మహిళ పై అసభ్యంగా ప్రవర్తించిన జగిత్యాల ఎస్ఐ అనిల్ పై పలు సెక్షన్లు క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు IPC Sec 290,323,34

బస్సు ఛేజ్ చేసి మరీ ఓవరాక్షన్ చేసిన జగిత్యాల ఎస్ఐ అనిల్.. ఆడవారి మధ్య జరిగిన పంచాయితీలో తలదూర్చి ఓవర్ యాక్షన్ చేశాడు ఓ ఎస్ఐ.

సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఆడవారి పంచాయితీలో తలదూర్చి రచ్చ చేశాడు. ఓ యువతి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిపోయి,మహిళ అని కూడా చూడకుండా రాక్షసంగా ప్రవర్తించాడు. బస్సును కారుతో ఛేజ్ చేసి మరీ ఓవరాక్షన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెట్టుకున్న మహిళల్లో ఒకరు ఎస్సై భార్య కాగా, మరొకరు యువతి. అయితే ఈ గొడవ విషయాన్ని మహిళ తన భర్తకు ఫోన్ చేసింది.

బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఏస్సై అనిల్ బస్సు ఆపాడు. తన భార్యతో ఎవరు నీతో గొడవ పెట్టుకున్నారని అసభ్యంగా మాట్లాడాడు.

Akhand Bhoomi News

error: Content is protected !!