బాధితురాలికి ఎల్ఓసి అందజేత
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12.(అఖండ భూమి న్యూస్) ;
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన విట్టల్ రెడ్డి భార్య స్వరూప అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయవలసిందని డాక్టర్ ఆదేశించారు.చెప్పగానే వాళ్ళ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి విషయం తెలుపగా వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి విట్టల్ రెడ్డి భార్య స్వరూప కి ప్రభుత్వ తరపు నుండి చికిత్స నిమిత్తం 3,00,000/- రూపాయలు
ఎల్. ఓ. సి ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి విట్టల్ రెడ్డి కుటుంబసభ్యులు కృతఙ్ఞతలు తెలియజేశారు.



