ఆధార్‌ నిబంధనలు కఠినతరం

 

న్యూఢిల్లీ: ఆధార్‌లో మార్పులు, చేర్పుల నిబంధనలను ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడాయ్‌)’ కఠినం చేసింది. గెజిటెడ్‌ అధికారి సంతకంతో కూడిన పత్రాన్ని సమర్పించి మాత్రమే చిరునామా మార్చుకునేలా నిబంధన చేర్చింది. ఆధార్‌లో ఇతర మార్పులు చేసుకోవాలంటే ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమర్పించాలి. వాటిలో అక్షర దోషాలుంటే కార్డుదారులు రూ.1000 జరిమానా చెల్లించాలి. కార్డుదారుల దరఖాస్తుల్లో తప్పుడు పత్రాలను సమర్పించిన ఆధార్‌ సేవా కేంద్రాల నిర్వాహకులు రూ.10 వేల జరిమానా చెల్లించాలి.

Akhand Bhoomi News

error: Content is protected !!