పారిశుధ్య కార్మికుల ఆరోగ్యమే ప్రధమ ప్రాధాన్యత
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 13)
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యము కి ప్రాధాన్యత ఇస్తున్నామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) B. చంద్రశేఖర్ ఐఏఎస్ గారు తెలియజేసారు. ఈ రోజు సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు సేవలను అందిస్తున్న పారిశుధ్య సిబ్బందికి వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వారికి సబ్బులు, ఆయిల్, బెల్లం, టవల్ మరియు రెయిన్ కోట్ లు అందించడం జరిగినది మరియు డ్రగ్స్ నిర్మూలన పైన ప్రతిజ్ఞ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బి.చంద్రశేఖర్ ఐఏఎస్, సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి, మున్సిపల్ కమీషనర్ m. శ్రీనివాస్ రెడ్డి, Dyee రఘు, మేనేజర్ సూర్య ప్రకాష్ , సానిటరీ ఇన్స్పెక్టర్ కుమార్ , ఆంబోజి, శానిటేషన్ జవాన్ లు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు