ఈమె రైలులో ప్రయాణం చేస్తూ వరంగల్ స్టేషన్ లో దిగబోతు జారి పడిపోయింది. కాలు విరిగిపోయింది. వివరాలు ఏమీ చెప్పలేకపోతోంది. ఏడుస్తూ ఉంది. కొంతమంది మంచివారు చూసి ఆమెను వరంగల్. MGM ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతము అక్కడే ఉంది.మాది కంచరపాలెం విశాఖపట్నం అని మాత్రమే చెప్పగలుగుతోంది.ఒక ఫోన్ నెంబర్ చెప్పింది. ఇప్పటికి ఒక వంద సార్లు ఆ ఫోనుకి చేసిన అది పనిచేయటం లేదు.ఇది జరిగి నేటికి సుమారు 20 దినములు అయినది. ఆమె కొడుకు అనకాపల్లిలో ఉంటాడుట. వాడు వచ్చి నన్ను తీసుకువెళతాడు అని చెబుతోంది.కానీ ఈ విషయము అతగాడికి చేరినట్లు లేదు.ఆమెని ఆమె కొడుకు దగ్గరకు చేర్చడానికి ఈ ప్రయత్నము. మీ మీ గ్రూపులలో కూడా దీనిని పోస్ట్ చేయవలసిందిగా ప్రార్థన.


