పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి
వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
(పాపన్నపేట మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 17 ) ఆదివారం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడం జరిగిందని ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేసిన పక్షంలో వరద ఉధృతి
తాకిడి ఉంటుందని ఆర్ అండ్ బి అధికారులు కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వర్షాలు వరదల వలన రైతులకు గాని సామాన్య ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని నీటిమట్టాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


