వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు…

వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)

*1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.

*2.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.

*3.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలెను.

*4.పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.

*5.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు.

*6.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.

*7.కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.

*8.చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.

*9.ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.

*10.గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.

*11.ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.

*12.ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు “డిష్ ” కనెక్షన్ తీసివేయవలెను.

*13.వర్షం పడుచున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ మోటర్స్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను, లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.

*14.కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.

15.ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి దృష్టికి తీసుకెల్లాలి. ప్రతి కరెంటు వస్తువు కు “ఎర్త్ ” తప్పనిసరిగా గా ఉండాలి.

Akhand Bhoomi News

error: Content is protected !!