సౌత్ క్యాంపస్ లో కొనసాగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 20 (అఖండ భూమి న్యూస్)
తెలంగాణ విశ్వ విద్యాలయం సౌత్ క్యాంపస్ లో పీజీ విద్యార్థుల పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెండో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరుగుతున్న గదులను ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ పరిశీలించారు. ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 170 మంది విద్యార్థులకు గాను 163 మంది హాజరయ్యారని 07 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.



