కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ప్రధాని శుభాకాంక్షలు

 

 

ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారాయన.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు. అలాగే.. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. బీజేపీ కార్యకర్తల కృషిని నేను అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తాం అని ట్వీట్‌ చేశారాయన.

Akhand Bhoomi News

error: Content is protected !!