యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4 (అఖండ భూమి న్యూస్);
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల ప్రచారం.లో భాగంగా
యూసఫ్ గూడ లో మైనారిటీ నాయకులతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో అనూహ్య స్పందన లభించింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గుర్తు చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నవీన్ యాదవ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సమావేశం నిర్వహించడం జరిగింది.
తమ ఓటు తప్పకుండా నవీన్ యాదవ్ కే ఓటు వేసి తమ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


