నేడే గిడుగు రామ్మూర్తి జయంతి…

నేడే గిడుగు రామ్మూర్తి జయంతి…

వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 28,(అఖండ భూమి న్యూస్)

నేడే గిడుగు జయంతి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిడుగు జయంతి ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు భాషలో వచ్చిన చారిత్రకమైన మార్పు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి సారధ్యంలో నడిచిన వ్యవహారిక భాష ఉద్యమం లేదా భాసోద్యమం. ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీన మైన గ్రాంథిక భాషకు మరియు వ్యవహారిక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం 1919- 20 ల మధ్య వ్యవహారిక భాషా ఉద్యమ ప్రచారం కోసం తెలుగు అనే మాసపత్రిక నడిపాడు.వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్రసాహిత్య పరిషత్తు సభలో 1925 తణుకులో 4 గంటల పాటు ప్రసంగించి గ్రంథాలను ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితి తీర్మానం చేసే విధంగా కృషి చేశాడు. 1919లో గిడుగు తెలుగు అనే మాస పత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కానీ ఆ పత్రిక ఒక ఏడాదే నడిచింది. చల్ల పిల్ల వెంకటశాస్త్రి, ఆదినారాయణశాస్త్రి ,సీతారామశాస్త్రి మొదలైన వారు వ్యవహారిక భాష వైపు మొగ్గు చూపారు. 1919లో ఫిబ్రవరి, 28న రాజ మహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా వర్తమా నాంధ్ర భాష ప్రవర్త సమాజం స్థాపించారు. 1924లో కాకినాడ లోని ఆంధ్ర సాహిత్య పరిషత్ అధికారికంగా వ్యవహారిక భాషాపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. 1933లో రామమూర్తి సబ్తాతి మహోత్సవమైన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు.తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో ఉద్గ్రంధాన్ని ఆయనకు సమర్పించారు. 1936లో నవ్య సాహిత్య పరిషత్ అనే సంస్థను ఆధునికల స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్ట వ్యవహారికాన్ని ప్రోత్సహించే ప్రతిభ అనే సాహిత్య పత్రికను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరాల భాష నేర్చుకొని వాళ్లకు చదువు చెప్పాలని కోరికకలిగింది. తెలుగు సవర భాషలు రెండు వచ్చిన ఒక ఒక సవర వ్యవహర్తను ఇంట్లోపెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. సొంత డబ్బుతో స్కూల్లు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరణలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాస్ ప్రభుత్వం ఆయన కృషికి మెచ్చి1913లో రావు బహదూర్ బిరుదు ఇచ్చారు. భాషా శాస్త్రంలో 1931లో ఇంగ్లీషులో సవర ఇంగ్లీష్ కోశాన్ని నిర్మించారు. 1934లో ప్రభుత్వము అతనికికై జర్ ఈహింద్ అనే స్వర్ణపు పథకాన్ని ఇచ్చి గౌరవించిది. గిడుగు వారి భాష ఉద్యమానికి కారణం స్వరాజ్యం కావాలంటున్నాం అన్నారు. ప్రత్యేకంద్ర రాష్ట్రం కోసం చిక్కు బడుతున్నాం. ప్రజాస్వామిక పరిపాలన కోరుచున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రజలకు సామాన్య జనులకు ఏ భాషద్వారా జ్ఞానం కలగజేయవలసి ఉంటుందో ఏభాషలో గ్రంథాల రచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీ చేతుల్లో పత్రికలు ఉన్న విపత్రిక ల ద్వారా మీరు ఎంతైనా చేయ గలరు. తెలుగును మాట్లాడదాం. గ్రామీణ తెలుగు ను ప్రోత్సహిద్దాం. ఏ భాష అయినా సామాన్యులకు మాట్లాడుకునేది గాఉంటేనే కానీ పరమార్థం నెరవేరుతుంది. నేడు గిడుగు జయంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వ్యావహారిక భాషను ప్రోత్సహిద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనులు.మాట్లాడే తెలుగును ప్రోత్సహిస్తాం బాధ్యతగా వ్యవహరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!